హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 12 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లో నివాస గృహాల విక్రయాలు అంతకంతకు పెరుగుతున్నాయి. గడిచిన సంవత్సరం చివరి త్రైమాసికం(అక్టోబర్-డిసెంబర్ మధ్యకాలం)లో నగరంలో 16,808 యూనిట్ల గృహాలు అమ్ముడయ్యాయి. వీటి విలువ రూ.9,497 కోట్ల స్థాయిలో ఉంటుందని స్వేర్ యార్డ్ వెల్లడించింది.
దేశంలోని ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్లో మార్కెట్ ఆశాజనకంగా ఉందని, సరసమైన ధరలతో పెట్టుబడి దారులు గృహాల కొనుగోలుకు ఆసక్తిచూపుతున్నారని వెల్లడించింది. పెట్టుబడి దారులకు అనుకూలమైన విధానాలు, మౌలిక సదుపాయాలు, మెరుగైన కనెక్టివిటీతో హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ ముందుకు సాగిందని స్కేర్ యార్డ్ పార్టనర్ దేబయన్ భట్టాచార్య తెలిపారు.