ముంబై, మే 18: రూపాయి పతనం కొనసాగుతున్నది. రోజుకొక కనిష్ఠ స్థాయికి జారుకుంటున్న మారకం విలువ సోమవారం మరింత దిగజారింది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 96.20కి పడిపోయింది. అంతర్జాతీయంగా నెలకొన్న రాజకీయ అనిశ్చిత పరిస్థితికి తోడు డాలర్ బలోపేతం కావడం, క్రూడాయిల్ భగ్గుమనడం కూడా మారకం పతనానికి పరోక్షంగా కారణమైంది.
ఇంధన ధరలు భగ్గుమనడంతో దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపనున్నదని, ఎఫ్పీఐలు నిధులు తరలించుకుపోవడం కూడా పతనానికి ఆజ్యంపోసింది. 96.19 వద్ద ప్రారంభమైన డాలర్-రూపీ ఎక్సేంజ్ రేటు ఇంట్రాడేలో 96.39 కనిష్ఠ స్థాయిని తాకింది. చివరకు ఫారెక్స్ మార్కెట్ ముగిసే సమయానికి 39 పైసలు కోల్పోయి 96.20 వద్ద ముగిసింది.