హైదరాబాద్, డిసెంబర్ 16: ప్రముఖ మొబైల్ విక్రయ సంస్థ బిగ్”సి’… 20వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా కంపెనీ ఫౌండర్, సీఎండీ బాలు చౌదరి మాట్లాడుతూ..2002లో చిన్న స్థాయిలో ఆరంభమైన సంస్థ అనతికాలంలో తెలుగు రాష్ర్టాల్లో అతిపెద్ద మొబైల్ విక్రయ సంస్థగా అవతరించిందన్నారు. ఇప్పటికే తెలంగాణ, ఆంధప్రదేశ్, తమిళనాడుల్లో 250కి పైగా స్టోర్లను నిర్వహిస్తున్నట్లు, వచ్చే ఏడాదికాలంలో చిన్న స్థాయి నగరాల్లో 100 స్టోర్లను ప్రారంభించాలనే లక్ష్యంతో ముందుకుసాగుతున్నట్లు చెప్పారు. చిన్న స్థాయి నగరాల్లో మొబైల్ సాంకేతికను అందించాలనే ఉద్దేశంతో శరవేగంగా స్టోర్ల ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 19వ వార్షికోత్సవం సందర్భంగా కంపెనీ పలు ఆఫర్లను ప్రకటించింది. కంపెనీ షోరూంలో కొనుగోలు చేసే మొబైల్పై 10 శాతం వరకు క్యాష్బ్యాక్, సులభ వాయిదాల పద్దతిలో వడ్డీ, డౌన్పేమెంట్ లేకుండా మొబైల్ కొనుగోలు చేసుకునే అవకాశాన్ని కల్పించింది. దీంతో పాటు ప్రతి మొబైల్ కొనుగోలుపై ఖచ్చితమైన బహుమతి అందిస్తున్నది.