న్యూఢిల్లీ, నవంబర్ 13: గత కొన్ని నెలలుగా ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన ధరల సూచీ క్రమంగా శాంతిస్తున్నది. దేశవ్యాప్తంగా కూరగాయల ధరలు తగ్గుముఖం పట్టడంతో గత నెలకుగాను రిటైల్ ధరల సూచీ నాలుగు నెలల కనిష్ఠ స్థాయి 4.87 శాతానికి పడిపోయింది. అయినప్పటికీ రిజర్వు బ్యాంక్ అంచనావేసిన 4 శాతం కంటే అధికంగా నమోదైంది. సెప్టెంబర్ నెలలో 5.02 శాతంగా నమోదైన విషయం తెలిసిందే. మరోవైపు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రిటైల్ ద్రవ్యోల్బణం 5.4 శాతంగా ఉంటుందని గత సమీక్షలో రిజర్వు బ్యాంక్ అంచనావేసిన విషయం తెలిసిందే. ఆహార పదార్థాల ధరలు తగ్గడంతో గత నెలలో ధరల సూచీ తగ్గుముఖం పట్టిందని ఇక్రా ఆర్థికవేత్త అదితి నాయర్ తెలిపారు.