Car Prices | న్యూఢిల్లీ, డిసెంబర్ 30: నూతన సంవత్సరంలో కార్లను కొనుగోలు చేయాలనుకుంటున్నారా..అయితే మీ జేబుకు మరిన్ని చిల్లులు పడబోతున్నాయి. దేశీయ ఆటోమొబైల్ సంస్థలు అన్నీ తమ వాహన ధరలను పెంచబోతున్నట్లు ఇదివరకే ప్రకటించాయి. ద్రవ్యోల్బణం, కమోడిటీ ఉత్పత్తుల ధరలు పెరగడంతో సంస్థలపై పడుతున్న అదనపు భారాన్ని తగ్గించుకోవడంలో భాగంగా ధరలు పెంచుతున్నట్లు వెల్లడించాయి. ధరలు పెంచే సంస్థల్లో కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకీ, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటర్స్, హోండాతోపాటు లగ్జరీ కార్ల సంస్థలు మెర్సిడెజ్ బెంజ్, ఆడీలు కూడా జనవరి 1 నుంచి 3 శాతం వరకు పెంచబోతున్నట్లు తెలిపాయి. ఇప్పటికే చమురు, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి ఇబ్బందులు ఎదుర్కొంటున్న సామాన్యులపై ఆటో మొబైల్ సంస్థ లు ధరల మోత మో గించబోతున్నాయి.
నిర్వహణ ఖర్చులు పెరగడంతోపాటు కమోడిటీ ఉత్పత్తుల ధరలు పెరగడం వల్లనే ధరలు పెంచాల్సి వస్తున్నదని మారుతి సుజుకీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ధరలు ఎంతమేర పెంచుతున్నదో మారుతి వెల్లడించకపోయినప్పటికీ ధరలు 2-3 శాతం వరకు పెరిగే చాన్స్ ఉన్నదని తెలుస్తున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నెలలో మారుతి 0.8 శాతం ధరలు పెంచిన విషయం తెలిసిందే. గడిచిన ఏడాదిలో సంస్థ 2.4 శాతం వడ్డించింది. టాటా మోటర్స్ కూడా ధరలను పెంచబోతున్నట్లు ప్రకటించింది కూడా. ప్యాసింజర్ వాహనాలతోపాటు ఎలక్ట్రిక్ వాహనాలను సైతం ధరలు సవరిస్తున్నట్లు తెలిపింది. లగ్జరీ కార్ల సంస్థలైన ఆడీ, మెర్సిడెజ్ బెంజ్లు రెండు శాతం వర కు వాహన ధరలు పెం చుతున్నట్టు ఇదివరకే ప్రకటించాయి కూడా.