పుణె, ఫిబ్రవరి 27: ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ బజాజ్ ఆటో..దేశీయ మార్కెట్లోకి నయా పల్సర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. 2024 ఎడిషన్గా విడుదల చేసిన ఈ పల్సర్ ఎన్ఎస్ సిరీస్ బైకులను తీసుకొచ్చింది. పల్సర్ ఎన్ఎస్ 2024 సిరీస్, ఎన్ఎస్200, ఎన్ఎస్160, ఎన్ఎస్ 125 మూడు రకాల్లో లభించనున్న ఈ బైకులు రూ.1,57,427, రూ.1,45,792, రూ.1,04,922 ధరను నిర్ణయించింది.
నూతన డిజిటల్ కన్సోలెస్ అండ్ ఎల్ఈడీ హెడ్ల్యాంప్తో తీర్చిదిద్దింది. పాత మాడల్తో పోలిస్తే ఈ నయా మాడల్ను సెమీ-డిజిటల్, బ్లూటూత్ కనెక్టివిటీ, ఇన్కమింగ్ కాల్స్, ఎస్ఎంఎస్ అలర్ట్, ఫోన్ బ్యాటరీ సామర్థ్యం, సిగ్నల్ లెవల్, నావిగేషన్ కూడా తెలుసుకోవచ్చును. 150 సీసీ సామర్థ్యంతో రూపొందించిన ఈ బైకుల విక్రయాల్లో ఈ బైకు అత్యధికంగా నమోదవుతున్నది.