హైదరాబాద్, ఆగస్టు 12: ప్రముఖ ఫార్మా సంస్థ దివీస్ ల్యాబ్ విశ్లేషకుల అంచనాలకుమించి ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. జూన్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.702 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది.
అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.557 కోట్లతో పోలిస్తే 26 శాతం అధికం. సమీక్షకాలంలో కంపెనీ ఆదా యం ఏడాది ప్రాతిపదికన 17.32 శాతం ఎగబాకి రూ.1,997 కోట్ల నుంచి రూ.2,343 కోట్లకు చేరుకున్నట్లు తెలిపింది.