హైదరాబాద్, ఏప్రిల్ 8: ప్రముఖ మొబైల్ రిటైల్ దిగ్గజాల్లో ఒకటైన సెలెక్ట్..ఉగాది పండుగను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ‘ఉగాది ఆఫర్ల వర్షం’ అనే నినాదంతో ప్రకటించిన ఈ ఆఫర్లలో 7.5 శాతం నుంచి 75 శాతం వరకు తగ్గింపు ధరకు మొబైళ్లను విక్రయిస్తున్నట్లు కంపెనీ సీఎండీ వై గురు తెలిపారు. ఈ ఆఫర్లు స్మార్ట్ఫోన్లతోపాటు టీవీ, ల్యాప్టాప్, విడిభాగాలకు కూడా వర్తిస్తున్నదన్నారు.
వీటితోపాటు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డుపై 7.5 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్, ఎల్ఈడీ స్మార్ట్ టీవీ అండ్ సౌండ్ బార్ కాంబోను రూ.11,999కే, బ్రాండెడ్ యాక్ససరీస్పై 75 శాతం వరకు డిస్కౌంట్, బజాజ్ ఫైనాన్స్ ద్వారా కొనుగోలుపై రూ.4 వేలు ఇన్స్టంట్ క్యాష్బ్యాక్, బ్రాండెడ్ యాక్ససరీస్ కాంబోస్ రూ.899 నుంచి లభించనున్నాయని చెప్పారు.