ముంబై, జూలై 25: ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ బజాజ్ ఆటో అంచనాలకుమించి రాణించింది. జూన్ త్రైమాసికానికిగాను సంస్థ రూ.1,665 కోట్ల కన్సాలిడేటెడ్ పన్నులు చెల్లించిన తర్వాత నికర లాభాన్ని గడించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.1,173 కోట్ల లాభంతో పోలిస్తే 42 శాతం పెరిగినట్లు వెల్లడించింది. 2022-23 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో నమోదైన రూ.8,005 కోట్ల ఆదాయంతో పోలిస్తే గత త్రైమాసికంలో 29 శాతం ఎగబాకి రూ.10,310 కోట్లకు చేరుకున్నది. గత త్రైమాసికంలో సంస్థ 10,27,407 యూనిట్ల ద్విచక్ర, కమర్షియల్ వాహనాలను విక్రయించింది.