న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్టీ) విధానం అమల్లోకి వచ్చినప్పటి నుంచి గతంలో ఎన్నడూలేని విధంగా 2022 జనవరి నెలలో రికార్డు స్థాయి వసూళ్లు నమోదయ్యాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్ చెప్పారు. లోక్సభలో 2022-23 బడ్జెట్ ప్రసంగంలో భాగంగా ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. 2022 జనవరిలో మొత్తం రూ.1,40,986 కోట్లు జీఎస్టీ రూపంలో ప్రభుత్వ ఖజానాకు చేరినట్లు తెలిపారు.
దేశంలో జీఎస్టీ విధానం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఏనాడు ఒక నెల మొత్తం వసూళ్లు రూ.1.40 కోట్లను దాటలేదని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. కాగా, జనవరి నెల మొదటి నుంచి నిన్న (జనవరి 31) మధ్యాహ్నం 3 గంటల వరకు రూ.1.38 కోట్ల ఆదాయం జీఎస్టీ రూపంలో వచ్చినట్లు గత రాత్రి కేంద్ర ఆర్థిక తెలిపింది. తాజాగా నిన్న మొత్తం వసూళ్లను కలిపి జనవరిలో రూ.1.40 కోట్లకుపైగా ఆదాయం వచ్చినట్లు ఆర్థికమంత్రి ప్రకటించారు.