ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను రిజర్వుబ్యాంక్ మరోసారి గోల్డ్ బాండ్లను జారీ చేసింది. ఈ నెల 6 నుంచి 10 వరకు విక్రయించనున్న గ్రాము గోల్డ్ బాండ్ ధరను రూ.5,611గా నిర్ణయించింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికిగాను సిరీస్-4 బాండ్లను ఆన్లైన్లో దరఖాస్తు, చెల్లింపులు జరిపేవారికి ఒక్కో గ్రాముపై రూ.50 రాయితీ ఇస్తున్నది. ఇలా చెల్లింపులు జరిపేవారు ఒక్కో గ్రాముపై రూ.5,561 చెల్లిస్తే సరిపోతున్నదని రిజర్వు బ్యాంక్ తాజాగా వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వ సూచనలకు మేరకు ఆర్బీఐ ఈ సావరిన్ గోల్డ్ బాండ్లను జారీ చేస్తున్నది.