న్యూఢిల్లీ, మార్చి 19: జర్మనీకి చెందిన విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ కూడా వాహన ధరలను పెంచుతున్నట్టు ప్రకటించింది. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చేలా అన్ని రకాల మాడళ్ల ధరలను 2 శాతం వరకు సవరిస్తున్నట్టు పేర్కొంది.
లాజిస్టిక్, విడిభాగాల ఖర్చులు అధికంకావడంతోపాటు రూపాయి చారిత్రక కనిష్ఠ స్థాయికి పడిపోవడం వల్లనే ధరలు పెంచాల్సి వస్తున్నదని బీఎండబ్ల్యూ గ్రూపు ఇండియా ప్రెసిడెంట్, సీఈవో హర్దీప్ సింగ్ బ్రార్ తెలిపారు. సంస్థ తీసుకున్న తాజా నిర్ణయంతో బీఎండబ్ల్యూ, మినీ బ్రాండ్ కార్లు మరింత ప్రియంకానున్నాయన్నారు.