హైదరాబాద్ సిటీబ్యూరో, మే 4 (నమస్తే తెలంగాణ): హైటెక్సిటీలో ఎల్అండ్టీ హైదరాబాద్ మెట్రో సంస్థ దేశంలోనే తొలి ఎలక్ట్రానిక్స్, టెక్నాలజీ షాపింగ్ మాల్ను ఏర్పాటు చేసింది. ఇక్కడి మెట్రో స్టేషన్ పక్కనే ఈ-గెలెరియా పేరుతో ఏర్పాటైన ఈ మాల్ను బుధవారం ప్రారంభించింది. మొబైల్ ఫోన్లు, టీవీలు, ఆడియో సిస్టంలు, కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, ప్రింటర్లు, పెరిఫెరల్స్, ఫోటోగ్రఫీ పరికరాలు, హోమ్, ఆఫీస్ ఆటోమేషన్, సెక్యూరిటీ ఉపకరణాలు, గేమింగ్, ఐటీ ఉత్పత్తులు అందుబాటులో ఉంటా యి. టెక్నాలజీకి సంబంధించిన ఇతర ఉత్పత్తులు, ఆధీకృత సర్వీసింగ్ కేంద్రాలు, టెక్ హైవ్, స్టార్టప్ టర్మినస్ పేరుతో ప్రత్యేక కేంద్రాలు ఈ మాల్లో లభిస్తాయని ఎల్అండ్టీ మెట్రో ప్రతినిధి వివరించారు. కొత్తగా స్టార్టప్లను ప్రారంభించే వారు వినియోగించుకునేలా వీటిని ఏర్పాటు చేసినట్టు తెలిపారు.