హైదరాబాద్, డిసెంబర్ 8: హైదరాబాద్కు చెందిన ఫిన్టెక్ స్టార్టప్ ఆక్సిలోన్స్.కామ్.. పీర్2పీర్ లెండింగ్ విభాగంలో ఉన్న అవకాశాలపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ విభాగంలో మల్టీ-బిలియన్ డాలర్ల అవకాశాలుండటం, చాలా తక్కువ స్థాయిలో సంస్థలు సేవలు అందిస్తున్నాయి. ఇతర ఆర్థిక విభాగాలతో పోలిస్తే పీ2పీ లెండింగ్ మార్కెట్లో అత్యధిక రిటర్నులు వస్తుండటంతో వీటిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు కంపెనీ ఫౌండర్, సీఈవో రాధాకృష్ణ తెలిపారు. ఇప్పటికే సంస్థ రూ.100 కోట్లకు పైగా రుణాలు ఇప్పించడం జరిగిందని, వచ్చే పండుగ సీజన్లో రూ.7 వేల కోట్ల వరకు బిజినెస్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.