ముంబై, ఫిబ్రవరి 29: తీవ్ర ఒడిదుడుకుల మధ్య కొనసాగిన దేశీయ స్టాక్ మార్కెట్లు చివర్లో లాభాల్లోకి వచ్చాయి. డెరివేటివ్ కాంట్రాక్టు గడువు ముగియడంతో మదుపరులు అమ్మకాలకు మొగ్గుచూపారు. ఫలితంగా నష్టాల్లో ప్రారంభమైన సూచీలు సమయం గడుస్తున్నకొద్ది భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. ఒక దశలో 72 వేల దిగువకు పడిపోయిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు మార్కెట్ ముగిసే సమయానికి 195 పాయింట్లు పెరిగి 72,500 వద్ద ముగిశాయి. గురువారం సెన్సెక్స్ 72,730 స్థాయి నుంచి 72,099 పాయింట్ల స్థాయిలో కదలాడింది.
మధ్యాహ్నాం తర్వాత అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలు లాభాల్లోకి రావడానికి దోహదం చేశాయి. బ్లూచిప్ సంస్థల షేర్ల పతనం కొనసాగుతుండటం, డెరివేటివ్ కాంట్రాక్టు గడువు ముగియడంతో మదుపరులు అమ్మకాలకు మొగ్గుచూపారని దలాల్స్ట్రీట్ వర్గాలు వెల్లడించాయి. మరోసూచీ నిఫ్టీ 31.65 పాయింట్లు ఎగబాకి 21,982.80 పాయింట్ల వద్ద ముగిసింది.