ముంబై, జూన్ 23: దేశీయ కరెన్సీకి మరిన్ని చిల్లులు పడ్డాయి. రోజుకొక కనిష్ఠ స్థాయికి జారుకుంటున్న రూపాయి మారకం విలువ గురువారం మరో ఆల్టైం హై కనిష్ఠ స్థాయికి పడిపోయింది. ఫారెక్స్ మార్కెట్లో అమెరికా కరెన్సీకి అనూహ్యంగా డిమాండ్ నెలకొనడం, దేశీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశీ పెట్టుబడులు తరలించుకుపోవడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను నీరుగార్చింది.
ఫారెక్స్ మార్కెట్ ముగిసే సమయానికి డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 19పైసలు కోల్పోయి ఆల్టైం కనిష్ఠ స్థాయి 78.32కి జారుకున్నది. 78.26 వద్ద ప్రారంభమైన కరెన్సీ విలువ ఒక దశలో 78.22 గరిష్ఠ స్థాయికి చేరుకున్నది. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ క్రూడాయిల్ స్వల్పంగా పెరగడం కూడా రూపాయి పతనానికి పరోక్షంగా కారణమైంది.