Small Savings Schemes | న్యూఢిల్లీ, సెప్టెంబర్ 29: డిసెంబర్ త్రైమాసికానికి ఒక్క స్కీమ్ మినహా మిగిలిన చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లను కేంద్ర ప్రభుత్వం యథాతథంగా అట్టిపెట్టింది. ఐదేండ్ల రికరింగ్ డిపాజిట్ పథకం వడ్డీ రేటును మాత్రం 6.5 శాతం నుంచి 6.7 శాతానికి పెంచుతూ శుక్రవారం కేంద్ర ఆర్థిక శాఖ ఒక సర్క్యులర్ జారీచేసింది.
తాజా సర్క్యులర్ ప్రకారం పొదుపు డిపాజిట్పై వడ్డీ రేటును 4 శాతం వద్ద, ఒక ఏడాది టర్మ్ డిపాజిట్ రేటును 6.9 శాతం వద్ద అట్టిపెట్టింది. సెప్టెంబర్తో ముగిసే త్రైమాసికంలో సైతం ఇవే రేట్లు ఉన్నాయి. పోస్టాఫీసుల్లో లభించే ఈ చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను ప్రతీ త్రైమాసికంలో ప్రభు త్వం ప్రకటిస్తుంది.