ముంబై, డిసెంబర్ 19: ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణపై నిర్ణయా న్ని సంబంధిత మంత్రిత్వ శాఖలు, రెగ్యులేటర్ (రిజర్వ్బ్యాంక్)తో సంప్రదింపులు జరిపిన తర్వాతే ప్రభుత్వం తీసుకుంటుందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కారద్ చెప్పారు. లోక్సభలో ఒక లిఖితపూర్వక ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ వ్యూహాత్మక వాటా విక్రయం పై వివిధ అంశాల్ని నిర్ణయిం తీసుకునే బాధ్యతను క్యాబినెట్ కమిటీకి అప్పగించే ముందుగానే సంబంధిత మంత్రిత్వ శాఖలు, రెగ్యులేటర్తో చర్చించనున్నట్టు తెలిపారు. ప్రైవేటు పెట్టుబడులతో ప్రభుత్వరంగ సంస్థలు వృద్ధిచెంది, ఆర్థికాభివృద్ధికి, కొత్త ఉద్యోగాల కల్పనకు, సామాజిక, అభివృద్ధి కార్యకలాపాలకు రుణ వితరణకు తోడ్పడతాయన్న లక్ష్యం తో వ్యూహాత్మక డిజిన్వెస్ట్మెంట్ విధానాన్ని అమలు చేస్తున్నట్టు మంత్రి వివరించారు. రెండు ప్రభుత్వ రంగ బ్యాంక్ల ప్రైవేటీకరించాలని 2021-22 కేంద్ర బడ్జెట్లో ప్రతిపాదించడంతో పాటు వ్యూహాత్మక వాటా విక్రయ విధానాన్ని ఆమోదించిన సంగతిని మంత్రి గుర్తు చేశారు. ఏదైనా ఒక బ్యాంక్ను పీఎస్బీ లేదా పీవీబీగా రిజర్వ్బ్యాంక్ వర్గీకరిస్తుందని మంత్రి తెలిపారు.