న్యూఢిల్లీ, మే 26: దేశంలో అతిపెద్ద స్టీల్ ఉత్పత్తి సంస్థ సెయిల్ లాభాలకు ఆదాయం గండికొట్టింది. గడిచిన త్రైమాసికంలో సంస్థ రూ.1,159.21 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో న మోదైన రూ. 2,478.82 కోట్ల లాభంతో పోలిస్తే 50 శాతం తగ్గింది.
అలాగే కంపెనీ ఆదాయం కూడా రూ.31,175.25 కోట్ల నుంచి రూ.29,416.39 కోట్లకు తగ్గాయి. 2022-23లో సంస్థ 4.95 మిలియన్ టన్నుల స్టీల్ను ఉత్పత్తి చేసింది. క్రితం ఏడాది చేసిన 4.60 మిలియన్ టన్నుల కంటే ఇది అధికం. మరోవైపు, గతేడాదికిగాను ప్రతి షేరుకు 50 పైసలు తుది డివిడెండ్ను సంస్థ ప్రతిపాదించింది.