గరిష్ఠ ధర రూ.2,08,593
న్యూఢిల్లీ, మార్చి 15: మధ్యస్థాయి ప్రీమియం బైకుల తయారీ సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్..దేశీయ మార్కెట్లోకి సరికొత్త మోడల్ స్క్రామ్ 411ను పరిచయం చేసింది. ప్రారంభ ధర రూ.2.03 లక్షలుగా నిర్ణయించింది. ఎల్ఎస్-410 ఇంజిన్ ప్లాట్ఫాంలో తయారు చేసిన ఈ బైకు రూ.2,03,085 నుంచి రూ.2,08,593 ధరల శ్రేణిలో లభించనున్నాయి. ఈ ధరలు చెన్నై షోరూంనకు సంబంధించినవి. ప్రస్తుతం భారత్లో అందుబాటులోకి వచ్చిన ఈ బైకులు..ఈ ఏడాది మధ్య నాటికి యూరప్, ఆసియా-పసిఫిక్ మార్కెట్లలో విడుదల చేయనున్నట్లు కంపెనీ వర్గాలు ప్రకటించాయి. 411 సీసీ 4-స్ట్రోక్ సింగిల్-సిలిండర్ ఇంజిన్ కలిగిన ఈ బైకు గరిష్ఠంగా 6,500 ఆర్పీఎం వద్ద 24.3 బీహెచ్పీ శక్తినివ్వనున్నది.