న్యూయార్క్ : తాము గతంలో ప్రకటించిన రూ 18.75 లక్షల ఎలక్ట్రిక్ కారును 2023లో లాంఛ్ చేయనున్నట్టు టెక్ బిలియనీర్, టెస్లా అధిపతి ఎలన్ మస్క్ టెస్లా ఉద్యోగులకు వెల్లడించినట్టు తెలిసింది. ఈ కారులో స్టీరింగ్ వీల్ ఉండదని ఆయన సంకేతాలు ఇచ్చారని చెబుతున్నారు.
టెస్లా న్యూ బ్యాటరీ సెల్, బ్యాటరీ మ్యాన్యుఫ్యాక్చరింగ్ కృషితో బ్యాటరీ వ్యయం 50 శాతం తగ్గనుండటంతో ఈ ధరకు నూతన ఎలక్ట్రిక్ కారు ఆవిష్కరణ సాధ్యమవుతుందని మస్క్ గతంలో పేర్కొన్నారని ఆటో టెక్ వెబ్సైట్ ఎలక్ట్రెక్.కో గుర్తుచేసింది. నూతన ఎలక్ట్రిక్ కారును చైనాలోని షాంఘై గిగాఫ్యాక్టరీలో ఉత్పత్తి చేయాలని టెస్లా ప్లాన్ చేస్తోంది. మరోవైపు టెస్లా ఎనర్జీ వెంచర్స్ సబ్సిడరీ ద్వారా రిటైల్ ఎలక్ట్రిక్ ప్రొవైడర్గా ఎదిగేందుకు టెస్లా ప్రయత్నాలు ముమ్మరం చేసింది.