న్యూఢిల్లీ, డిసెంబర్ 24: కస్టమర్ల కాల్ డాటా, ఇంటర్నెట్ వినియోగం రికార్డులను కనీసం రెండేైండ్లెనా భద్రపర్చాలని టెలికం సంస్థలను టెలికం శాఖ ఆదేశించింది. ఇప్పటిదాకా ఏడాదిగానే ఉన్న ఈ రికార్డుల గడువును.. ప్రజా ప్రయోజనాలు, భద్రతా కారణాల దృష్ట్యా రెండేండ్లకు పొడిగించారు. అయితే తమ నుంచి ఎటువంటి తదుపరి ఆదేశాలు రాకపోతేనే నిల్వచేసిన సదరు డాటాను రెండేండ్ల తర్వాత తొలగించవచ్చని ఈ సందర్భంగా విడుదల చేసిన ఓ సర్క్యులర్లో టెలికం శాఖ స్పష్టం చేసింది. అన్ని కమర్షియల్, వైఫై, మొబైల్ యాప్ కాల్స్ డాటాతోపాటు ఈ-మెయిల్, ఎక్సేంజ్/ఐపీ వివరాల రికార్డులను కనీసం రెండేైండ్లెనా నిల్వ ఉంచాలంటూ లైసెన్స్ల్లో టెలికం శాఖ సవరణలు చేసింది.