Expo-2022 Dubai | దుబాయిలో మంగళవారం (నవంబర్ 9) నుంచి ఈ నెల 12 వరకు జరిగే ఇండస్ట్రీయల్ ఎక్స్పో జరుగనున్నది. ఈ ఎక్స్పోలో ఇండియా పెవిలియన్లో రాష్ట్ర స్టార్టప్ల శక్తి సామర్థ్యాలు, ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తల విజయగాధలను తెలంగాణ ప్రభుత్వం ప్రదర్శించనున్నది. ఎక్స్పోలో జరిగే ఈవెంట్స్, మీటింగ్స్లో ఇన్నోవేటివ్ ఐడియాలు, ఉత్పత్తులు, సర్వీసుల రంగాల్లో వ్యాపార అవకాశాలపై రాష్ట్ర స్టార్టప్లు, ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలు వివరిస్తారు. పెట్టుబడులకు, స్టార్టప్ ఎకో సిస్టమ్కు తెలంగాణ మెరుగైందని పేర్కొంటూ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ఆహ్వానించనున్నారు.
తెలంగాణ ప్రతినిధి బృందానికి ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎఫ్టీసీసీఐ), చాంబర్ మెంబర్ ఆఫ్ ది ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎఫ్ఐసీసీఐ) అధ్యక్షుడు కే భాస్కర్రెడ్డి సారధ్యం వహిస్తారు. మొత్తం 17 మంది ప్రతినిధులు ఈ ఎక్స్పోలో పాల్గొంటారు. సమావేశాలు, ఈవెంట్లలో తెలంగాణలో బిజినెస్ ఒప్పందాలకు గల అవకాశాలపై ఫోకస్ చేస్తారు.
ఎఫ్టీసీసీఐ సీనియర్ వైస్ప్రెసిడెంట్-జీవక ఇండస్ట్రీస్ ఎండీ అనిల్ అగర్వాల్, సుధాకర్ ఇరిగేషన్ సిస్టమ్స్ ఎండీ-ఎఫ్టీసీసీఐ వైస్ప్రెసిడెంట్ మీలా జయదేవ్, పొకర్ణ సీఎండీ గౌతం తదితరులు ఈ ప్రతినిధి బృందంలో పాల్గొంటారు. ఐదుగురు మహిళా పారిశ్రామికవేత్తలు ఏర్పాటు చేసిన ఐదు స్టార్టప్లతోపాటు మొత్తం 14 స్టార్టప్లు ఇందులో పాల్గొంటాయి.