హైదరాబాద్, ఏప్రిల్ 19: ప్రభుత్వ షెడ్యూల్డ్ బ్యాంక్ అయిన తెలంగాణ గ్రామీణ బ్యాంక్ (టీజీబీ) నికరలాభాన్ని భారీగా పెంచుకుంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో తమ నికరలాభం 26.94 శాతం వృద్ధిచెంది రూ. 373.16 కోట్లకు చేరినట్టు బ్యాంక్ తెలిపింది. గత ఏడాది ఇది రూ. 293.96 కోట్లుగా ఉంది. ఆడిటెడ్ ఆర్థిక ఫలితాల్ని మంగళవారం బ్యాంక్ విడుదల చేసింది. డిపాజిట్లు 9 శాతంపైగా పెరిగి రూ.10,109 కోట్ల నుంచి రూ.11,040 కోట్లకు, అడ్వాన్సులు 11.57 శాతం వృద్ధితో రూ.10,104 కోట్ల నుంచి రూ. 11,273 కోట్లకు పెరిగాయి. తమ ఖాతాదారుల సంఖ్య 39 లక్షలకు పెరిగిందని బ్యాంక్ తెలిపింది.