హైదరాబాద్, జూలై 20: బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బిట్స్) పిలానీ.. తెలంగాణ సర్కారుతో దోస్తీ కట్టింది. రాష్ట్రంలో పాలిటెక్నిక్స్, ఇంజినీరింగ్ సంస్థల కోసం టెక్నాలజీ ఆధారిత లాబొరేటరీల అభివృద్ధికిగాను రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నట్టు బుధవారం బిట్స్ పిలానీ తెలియజేసింది.
ఈ మేరకు బిట్స్ పిలానీ వర్క్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ప్రోగ్రామ్స్ (విల్ప్) డివిజన్, తెలంగాణ ప్రభుత్వం తరఫున స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (ఎస్బీటీఈటీ)లు ఎంవోయూపై సంతకాలు చేశాయని ఓ ప్రకటనలో వెల్లడించింది. కాగా, లాబొరేటరీలకు ఎస్బీటీఈటీ నిధులను సమకూర్చుతుంది.