న్యూఢిల్లీ, డిసెంబర్ 3: దేశీయ ఐటీ సంస్థ టెక్ మహీంద్రా..యాక్టివస్ కనెక్ట్లో 100 శాతం వాటాను కొనుగోలు చేసింది. వర్క్-ఎట్-హోమ్ కస్టమర్ల ఎక్స్పీరియన్స్ మేనేజ్మెంట్ సొల్యుషన్స్ అందించే ఈ అమెరికా సంస్థను 62 మిలియన్ డాలర్ల(రూ.466 కోట్లకు)కు చేజిక్కించుకున్నది. 1,750 మంది ఉద్యోగులు కలిగిన యాక్టివస్ కనెక్ట్ గతేడాది 17 మిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించింది. 2018లో ప్రారంభమైన యాక్టివస్ కనెక్ట్..ఈమెయిల్, ఫోన్, టెక్స్, వీడియో, సోషల్ ఎక్స్పీరియన్స్ సేవలను అందిస్తున్నది.