న్యూఢిల్లీ, అక్టోబర్ 27: నాన్-సాలరీ ట్రాన్జాక్షన్స్ కోసం టీడీఎస్ దాఖలుకున్న గడువును వచ్చే నెల 30దాకా ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డు (సీబీడీటీ) గురువారం పొడిగించింది. ఫామ్ 26క్యూలో త్రైమాసిక టీడీఎస్ స్టేట్మెంట్ దాఖలుకున్న గడువును నెల రోజులు పెంచుతున్నట్టు ఈ సందర్భంగా ప్రకటించింది. ‘సవరించిన, ఆధునికీకరించిన ఫామ్ 26క్యూలో టీడీఎస్ స్టేట్మెంట్ దాఖలుకు ఎదురవుతున్న ఇబ్బందుల దృష్ట్యా ఈ ఆర్థిక సంవత్సరం (2022-23) రెండో త్రైమాసికానికి (జూలై-సెప్టెంబర్)గాను ఫామ్ 26క్యూ దాఖలు గడువును అక్టోబర్ 31 నుంచి నవంబర్ 30కి పెంచుతున్నాం’ అని సీబీడీటీ ఓ ప్రకటనలో తెలియజేసింది.