TCS : మనదేశంలో మహిళా ఉద్యోగులు ఎక్కువ మంది ఉన్న కంపెనీగా టాటా కన్సల్టెన్సీ(టీసీఎస్) సర్వీసెస్ నిలిచింది. ముంబై కేంద్రంగా ఉన్న ఈ ఐటీ కంపెనీలో 2.1 లక్షల మంది మహిళలు వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు. బర్గండి ప్రైవేట్ (యాక్సిస్ బ్యాంక్కు చెందిన ప్రైవేట్ సంస్థ), హురన్ ఇండియా అనే సంస్థలు నిర్వహించిన సర్వేలో ఈ విషయం బయటపడింది. ఈ సర్వే కోసం మనదేశంలోని 500 కంపెనీలపై స్టడీ చేసింది. టీసీఎస్లో ప్రస్తుతం 5,92,195 ఉద్యోగులు ఉన్నారు. వీళల్లో 35శాతం మంది మహిళలే కావడం విశేషం.
టీసీఎస్ తర్వాత ఎక్కుమంది మహిళా ఉద్యోగులు ఉన్న 5 సంస్థలు ఇవే.. దాదాపు 1.25 లక్షల మంది మహిళా ఉద్యోగులతో ఇన్ఫోసిస్ రెండో స్థానంలో ఉంది. విప్రోలో 88,946 మంది మహిళలు పనిచేస్తున్నారు. హెచ్సీఎల్ టెక్నాలజీస్లో 62,780 మంది, రిలయన్స్ ఇండస్ట్రీస్లో 62, 560 మంది మహిళలు వివిధ హోదాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు.
టీసీఎస్ను 1968లో ఏప్రిల్ 1వ తేదీన ఫకీర్ చంద్ కోహ్లీ, జేఆర్డీ టాటా ప్రారంభించారు. ముంబై కేంద్రంగా ఉన్న ఈ కంపెనీకి 46 దేశాల్లో బ్రాంచీలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ కంపెనీలో 6 లక్షల మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు.