TCS Shares Buy Back | దేశంలోనే అతిపెద్ద ఐటీ సర్వీసుల కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) మళ్లీ షేర్ల బై బ్యాక్ ఆఫర్కు వెళ్లనున్నది. దీనిపై ఈ నెల 12న జరిగే బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని శుక్రవారం టీసీఎస్ తెలిపింది. అదే రోజు 2021-22 ఆర్థిక సంవత్సర తృతీయ త్రైమాసిక ఆర్థిక ఫలితాలను వెల్లడిస్తామని తెలిపింది.
సెబీ (లిస్టింగ్ అబ్లిగేషన్స్ అండ్ డిస్క్లోజర్ రిక్వైర్మెంట్స్) రెగ్యులేషన్స్-2012లోని 29 (1) (బీ) సెక్షన్ ప్రకారం.. తమ కంపెనీ షేర్ల బై బ్యాక్కు వెళ్లనున్నట్లు బీఎస్ఈ ఫైలింగ్లో తెలిపింది. దీనిపై 12న తమ సంస్థ బోర్డు సమావేశం నిర్ణయం తీసుకుంటుందని పేర్కొంది. టీసీఎస్ బై బ్యాక్ రికార్డు డేట్, ఇతర అంశాలను కూడా అదే రోజు ప్రకటిస్తారని తెలుస్తున్నది.
అంతే కాదు.. మూడో త్రైమాసికంలో వాటాదారులకు ఇంటరిం డివిడెండ్నిచ్చే అంశాన్ని టీసీఎస్ బోర్డు పరిశీలిస్తుందని భావిస్తున్నారు. 2020 డిసెంబర్ 18 నుంచి 2021 జనవరి 1 మధ్య షేర్ల బైబ్యాక్ ద్వారా రూ.16వేల కోట్ల నిధులు సేకరించింది. స్క్రిప్ట్ ధర రూ.3000 ప్రకారం బై బ్యాక్ కింద 5.33 కోట్లకు పైగా షేర్లను విక్రయించింది.