TATA Group : టాటాగ్రూప్ మరో కొత్త బిజినెస్ మొదలుపెట్టబోతోంది. కార్ల తయారీకి పాపులర్ అయిన ఈ కంపెనీ త్వరలోనే సెమీకండక్టర్లమార్కెట్లో అడుగుపెట్టనుంది. కొన్ని సంవత్సరాల్లో భారతదేశంలో సెమీకండక్టర్లను తయారు చేస్తామని టాటా సన్స్ ఛైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ గురువారం వెల్లడించారు. ‘మేము టాటా ఎలక్ట్రానిక్స్ను ప్రవేశపెట్టాం. దానికి అనుబంధంగా సెమీకండక్టర్ అసెంబ్లీ టెస్టింగ్ వ్యాపారాన్ని కూడా మొదలుపెట్టబోతున్నాం. చిప్స్ తయారీ కంపెనీలతో ఈ విషయమై చర్చలు జరుపుతున్నాం’ అని జపాన్కు చెందిన నిక్కే ఆసియా అనే బిజినెస్ పత్రిక ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయం చెప్పారు. అంతేకాదు రానున్న రోజుల్లో సెమీకండక్టర్ చిప్స్ తయారీ కోసం 90 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టునున్నట్టు చంద్రశేఖరన్ వెల్లడించారు.
టాటా కంపెనీ సెమీకండక్టర్ చిప్స్ను తయారీ రంగంలోకి వస్తే.. ప్రపంచవ్యాప్తంగా చిప్స్ మార్కెట్లో భారత్ ప్రధాన ఎగుమతిదారు అవుతుంది. 2020లో టాటా గ్రూప్ ఎలక్ట్రానిక్స్ వ్యాపారంలోకి వచ్చింది. ప్రస్తుతం టాటా ఎలక్ట్రానిక్స్లో లక్ష కోట్ల రూపాయల బిజినెస్ అవుతోంది. టాటా డిజిటల్ విభాగం సూపర్ యాప్ను తయారుచేసే ఆలోచనలో ఉంది. అందులో భాగంగానే బిగ్బాస్కెట్, 1 ఎంజీ వంటి యాప్లను కొనుగోలు చేసింది. అంతేకాదు ఫిట్నెస్కు సంబంధించిన క్యూర్ఫిట్ అనే యాప్లో పెట్టుబడులు పెట్టింది.