ముంబై, ఫిబ్రవరి 8: దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటర్స్ మరో చరిత్ర సృష్టించింది. దేశీయ మార్కెట్లోకి తొలిసారిగా ఆటోమెటిక్ వెర్షన్ సీఎన్జీ మాడల్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. 28.08 కిలోమీటర్ల మైలేజీ ఇచ్చే టియాగో, టిగోర్ ఐసీఎన్జీ ఏఎంటీ వెర్షన్ను గురువారం ప్రవేశపెట్టింది.
వీటిలో నాలుగు రకాలుగా లభించనున్న టియాగో ఐసీఎన్జీ మాడల్ రూ.7.90 లక్షల నుంచి రూ.8.80 లక్షల వరకు, టిగోర్ ఐసీఎన్జీ రూ.8.85 లక్షల నుంచి రూ.9.55 లక్షల లోపు ధరను నిర్ణయించింది. ఈ ధరలు ఢిల్లీ షోరూంనకు సంబంధించినవి. ఈ సందర్భంగా టాటా మోటర్స్ ప్యాసింజర్ వాహన విభాగ చీఫ్ కమర్షియల్ అధికారి అమిత్ కామత్ మాట్లాడుతూ..దేశవ్యాప్తంగా సీఎన్జీ లభ్యత అధికం కావడంతో ఈ సెగ్మెంట్ వాహనాలపై ప్రత్యేక దృష్టి సారించడం జరిగిందని, గత రెండేండ్లలో 1.3 లక్షల సీఎన్జీ వాహనాలను విక్రయించినట్లు చెప్పారు.