న్యూఢిల్లీ : భారత్ మార్కెట్లో తొలి సీఎన్జీ కారు టాటా టియాగో వచ్చే ఏడాది జనవరిలో సేల్కు సిద్ధమవుతుందని టాటా మోటార్స్ వెల్లడించింది. పాసింజర్ వెహికల్ సీఎన్జీ మార్కెట్లో ఎంట్రీకి ఎప్పటినుంచో టాటా మోటార్స్ సన్నాహాలు చేపట్టినా చిప్ సంక్షోభంతో జాప్యం నెలకొనగా తాజాగా 2022 జనవరిలో టాటా టియాగో లాంఛ్ ఖరారైందని కంపెనీ నిర్ధారించింది. టియాగో సీఎన్జీతో టాటా మోటార్స్ సీఎన్జీ మార్కెట్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనుంది.
ఈ కారుతో పాటు భారత్ లైనప్లో టిగర్ సీఎన్జీని కూడా చేర్చుతుందని భావిస్తున్నారు. ఇక టాటా టియాగో సీఎన్జీ బుకింగ్స్ అక్టోబర్ నుంచే భారత్లో ప్రారంభం కాగా రూ 11,000 టోకెన్ అమౌంట్తో ఈ కారును బుక్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఇక మారుతి సుజుకి, హ్యుందాయ్లు ఇప్పటికే సీఎన్జీ వెహికల్స్ను అందుబాటులోకి తీసుకురాగా టియాగో సీఎన్జీతో ఈ జాబితాలో టాటా మోటార్స్ చేరనుంది.
మరోవైపు పలు సీఎన్జీ మోడల్స్ను ఇప్పటికే తీసుకువచ్చిన మారుతి సుజుకి న్యూ సెలెరియో సీఎన్జీ, డిజైర్ సీఎన్జీ, స్విఫ్ట్ సీఎన్జీ సహా పలు న్యూ సీఎన్జీ మోడల్స్ను ప్రవేశపెట్టేందుకు కసరత్తు సాగిస్తోంది. ఇక టాటా టియాగో సీఎన్జీ లాంఛ్ అయితే ఈ వాహనం హ్యుందాయ్ శాంట్రో సీఎన్జీ, హ్యుందాయ్ ఐ10 గ్రాండ్ సీఎన్జీ, మారుతి సుజుకి వ్యాగన్ఆర్ సీఎన్జీ సహా త్వరలో రాబోయే మారుతి సుజుకి సీఎన్జీ మోడల్స్కు దీటైన పోటీ ఇవ్వనుంది.