TCS | ప్రముఖ కార్పొరేట్ సంస్థ టాటా సన్స్ తన అనుబంధ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)లో 0.65 శాతం వాటా విక్రయం ద్వారా సుమారు రూ.9000 కోట్ల నిధులు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో మంగళవారం బీఎస్ఈలో ఇంట్రాడే ట్రేడింగ్లో టీసీఎస్ షేర్ మూడు శాతం పతనమై రూ.4,021కి పతనమైంది. మంగళవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి టీసీఎస్ వాటా రూ.3,977.30లకు పడిపోయింది. సోమవారం స్టాక్ మార్కెట్లలో టీసీఎస్ షేర్ ముగింపు విలువలో 3.65 శాతం డిస్కౌంట్తో రూ.4001 చొప్పున 2.34 కోట్ల షేర్లు విక్రయిస్తామని టాటా సన్స్ వెల్లడించింది. ఇందుకోసం ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులు జేపీ మోర్గాన్, సిటీ గ్రూప్ బ్యాంకులను నియమించింది.
దేశీయ ఐటీ దిగ్గజం టీసీఎస్లో టాటా సన్స్ వాటా 72.38 శాతం. రూ.14.6 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్తో దేశంలోని బ్లూచిప్ కంపెనీల్లో టీసీఎస్కు రెండో స్థానం. టీసీఎస్లో టాటా సన్స్ వాటా ఎంత అన్న సంగతి తెలియదు కానీ స్టాక్ మార్కెట్లలో లిస్టింగ్ కావడానికి టాటా సన్స్కు ఉన్న రుణాలు ఆటంకంగా ఉన్నట్లు తెలుస్తున్నది. ఈ రుణాలపై మినహాయింపు ఇచ్చేందుకు ఆర్బీఐ నిరాకరించినట్లు సమాచారం. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో న్యాయ, ఆర్థిక నిపుణుల సూచనల మేరకు టీసీఎస్లో తన 0.65 శాతం వాటాను బ్లాక్ డీల్ ద్వారా టాటా సన్స్ విక్రయించనున్నది. ప్రస్తుతం టాటా సన్స్కు రూ.20 వేల కోట్ల రుణాలు ఉన్నాయి.