న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24: టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ పునర్నియామకం వాయిదాపడింది. 2017లో టాటా గ్రూపు చైర్మన్గా పదవీ బాధ్యతలు చేపట్టిన చంద్రశేఖరన్ మూడోసారి చైర్మన్గా నియమించే అంశంపై నిర్ణయం ప్రస్తుతానికి వాయిదావేయాలని టాటా సన్స్బోర్డ్ నిర్ణయం తీసుకున్నది. చంద్రశేఖరన్ను మరోసారి చైర్మన్గా కొనసాగించడాన్ని టాటా ట్రస్ట్ బోర్డులో పలువురు డైరెక్టర్ల మద్దతు ఉన్నప్పటికీ నోయల్ టాటా మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
కొత్తగా చేపట్టిన వ్యాపారాలపై చర్చ జరుగాల్సిన అవసరం ఉందన్నారు. దీంతోపాటు పునర్నియామకం చేపట్టడానికి ఆయన కొన్ని షరతులు పెట్టారు. గతేడాది రెండోసారి నియమితులైన ఆయన పదవీకాలం వచ్చే ఏడాది ఫిబ్రవరి 2027న ముగియనున్నది. గ్రూపునకు సంబంధించిన పలు సంస్థలు భారీగా నష్టపోయాయని, రుణాలు కూడా భారీగా పెరిగాయన్నారు. కానీ, గడిచిన ఐదేండ్లలో టాటా గ్రూపు టర్నోవర్ రెండింతలు, నికర లాభం మూడింతలు పెరిగింది.