ముంబై, మే 12: ఎయిర్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మేనేజింగ్ డైరెక్టర్(ఎండీ)గా క్యాంప్బెల్ విల్సన్ నియమిస్తూ టాటా సన్స్ ఆదేశాలు జారీ చేసింది. ఈ నియామకానికి ఎయిర్ ఇండియా బోర్డ్ కూడా ఆమోదం తెలిపింది. సింగపూర్ ఎయిర్లైన్స్ సబ్సిడరీ సంస్థయైన స్కౌట్ సీఈవోగా విధులు నిర్వహించిన క్యాంప్బెల్కు విమానయాన రంగంలో 26 ఏండ్లకు పైగా అనుభవం ఉన్నది. ఎయిర్ ఇండియాలోకి క్యాంప్బెల్కు స్వాగతం పలుకుతున్నట్లు, విమానయాన రంగంలో ఉన్న ఆయనకు ఉన్న అనుభవం ఎయిర్ ఇండియాకు దోహదం చేయనున్నదని టాటా సన్స్, ఎయిర్ ఇండియా చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ తెలిపారు.