న్యూఢిల్లీ: భారత్లో టాటా(Tata) కంపెనీ ఐఫోన్లు ఉత్పత్తి చేయనున్నది. కర్నాటకలో ఉన్న విస్ట్రాన్ కార్ప్స్ ఫ్యాక్టరీతో టాటా కంపెనీ ఒప్పందం కుదుర్చుకోనున్నది. ఆ ఒప్పందం చివరి దశలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆగస్టులో ఆ టేకోవర్ ఉంటుందని భావిస్తున్నారు. కర్నాటకలో ఉన్న విస్ట్రాన్ కంపెనీలో ఐఫోన్ 14 మోడళ్లను అసెంబ్లీ చేస్తుంది. అయితే ఇక నుంచి ఆ విస్ట్రాన్ కంపెనీ కార్యకలాపాలను టాటా కంపెనీ చూసుకోనున్నది. టాటా కంపెనీతో కుదర్చుకున్న డీల్ వల్ల హార్డ్వేర్ ఉత్పత్తిరంగం ప్రతిష్ట పెరగనున్నది.
విస్ట్రాన్ ఫ్యాక్టరీ విలువ సుమారు 4వేల కోట్లు ఉంటుంది. ఇండియాకు 1.8 బిలియన్ల డాలర్ల ఆర్డర్లు ఇచ్చేందుకు యాపిల్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నది. టాటా-విస్ట్రాన్ డీల్ ద్వారా ప్లాంట్లో సిబ్బందిని పెంచాలని కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి.