Tata -Wistron India | భారత్లో ఆపిల్ ఐ-ఫోన్ల సరఫరా దారు విస్ట్రన్ ఇండియా (Wistron India)ను టాటా గ్రూప్ టేకోవర్ చేసినట్లు తెలుస్తున్నది. అదే జరిగితే దేశంలో ఆపిల్ ఐ-ఫోన్ల అసెంబ్లింగ్ చేయనున్న తొలి దేశీయ కంపెనీగా టాటా గ్రూప్ (Tata Group) నిలవునున్నది.
ఇప్పటికే తమిళనాడులో ఐ-ఫోన్ విడి భాగాలను టాటా గ్రూప్ సరఫరా చేస్తోంది. తాజాగా విస్ట్రన్ ఇండియాను టాటా గ్రూప్ టేకోవర్ చేస్తే.. ఇప్పటికే భారత్లో ఐ-ఫోన్లను అసెంబ్లింగ్ చేస్తున్న ఫాక్స్కాన్, పెగాట్రాన్ సరసన టాటా గ్రూప్ నిలువనున్నది.
విస్ట్రన్ ఇండియాలో 100 శాతం షేర్ల కొనుగోలు ఒప్పందంపై టాటా గ్రూప్ సంతకం చేసినట్లు ఓ ఆంగ్ల దినపత్రిక వార్త కథనం ప్రచురించింది. భారత్లో ఆపిల్ ఐ-ఫోన్ల అసెంబ్లింగ్ కాంట్రాక్ట్ పొందేందుకు విస్ట్రన్ ఇండియాకు సుమారు రూ.1040 కోట్లు టాటా గ్రూప్ చెల్లించనున్నది.