న్యూఢిల్లీ: కమర్షియల్ వాహన ధరలను పెంచిన టాటా మోటర్స్..తాజాగా ప్యాసింజర్ వాహనాల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఉత్పత్తి వ్యయం పెరుగడంతో ధరలను జనవరి 1 నుంచి పెంచుతున్నట్లు కంపెనీ వెల్లడించింది. టాటా మోటర్స్తోపాటు లగ్జరీ మోటర్సైకిల్ బ్రాండ్ డుకాటీ కూడా వాహన ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఎంతమేర పెంచుతున్నదో మాత్రం వెల్లడించలేదు.