న్యూఢిల్లీ, సెప్టెంబర్ 24: దేశీయంగా ఎస్యూవీలకు పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని టాటా మోటర్స్ సరికొత్త మాడళ్లను మార్కెట్కు పరిచయం చేసింది. నెక్సాన్ విభాగంలోనే సీఎన్జీ, సరికొత్త 45 కిలోవాట్ల బ్యాటరీతో నెక్సాన్ ఈవీని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ నయా ఈవీ వేగవంతంగా చార్జింగ్ అవడమే కాకుండా పలు నూతన ఫీచర్లతో తీర్చిదిద్దిన ఈ మాడల్ రూ.13.99 లక్షల నుంచి రూ.17.19 లక్షల లోపు లభించనున్నది. ఈ ధరలు ఢిల్లీ షోరూంనకు సంబంధించినవి.
అలాగే టర్బోచార్జర్ సీఎన్జీ వాహనం రూ.8.99 లక్షల ప్రారంభ ధరతో లభించనున్నది. దీంతో టాటా నెక్సాన్ అన్ని రకాలు పెట్రోల్, డీజిల్, సీఎన్జీ, ఎలక్ట్రిక్ విభాగంలో లభించిన తొలి మాడల్ ఇదే కావడం విశేషం. 45 కిలోవాట్ల బ్యాటరీ కలిగిన ఈవీ మాడల్ సింగిల్ చార్జింగ్తో 350 నుంచి 370 కిలోమీటర్ల వరకు మైలేజీ ఇవ్వనున్నది.
ఈ సందర్భంగా టాటా ప్యాసింజర్ విభాగ చీఫ్ కమర్షియల్ అధికారి వివేక్ శ్రీవాత్సవ మాట్లాడుతూ..ఏడేండ్ల క్రితం దేశీయ మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చిన నెక్సాన్ ఇప్పటి వరకు ఏడు లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయని, ఇదే ఒరవడిని కొనసాగిస్తూ సరికొత్త మాడళ్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చెప్పారు.