TATA Motors | దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ తన కమర్షియల్ వాహనాలపై 2.5 శాతం ధరలు వచ్చేనెల ఒకటో తేదీ నుంచి పెంచనున్నది. ఈ మేరకు సోమవారం ఎక్స్చేంజ్లకు ఇచ్చిన సమాచారంలో తెలిపింది. ఎం అండ్ హెచ్సీవీ, ఐ అండ్ ఎల్సీవీ, ఎస్సీవీ, బస్సులతోపాటు వేరియంట్ల ప్రాతిపదికన అన్ని వాహనాలకు ఈ ధర పెంపు వర్తిస్తుందని పేర్కొంది.
ఇన్పుట్ కాస్ట్ వ్యయం పెరిగిపోయిందంటూ ఇంతకుముందు పలు దఫాలు మారుతి సుజుకి తన కార్ల ధరను పెంచడంతోపాటు వచ్చేనెలలో మరో దఫా పెరుగుతాయని ప్రకటించింది. స్టీల్, అల్యూమినియం తదితర లోహాల ధరలు, ఇతర ముడి సరుకుపై అధిక ధరల వల్ల కమర్షియల్ వెహికల్స్ ధరలు పెంచక తప్పడం లేదని టాటా మోటార్స్ తెలిపింది.