న్యూఢిల్లీ, జూన్ 23 : దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటర్స్ ప్యాసింజర్ వెహికల్ లిమిటెడ్ వ్యాపారాన్ని శరవేగంగా విస్తరిస్తున్నట్టు ప్రకటించింది. వచ్చే ఐదేండ్లలో మార్కెట్ వాటాను 20 శాతానికి పెంచుకోవడానికి రూ.40 వేల కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నట్టు కంపెనీ ఎండీ, సీఈవో శైలేష్ చంద్ర తెలిపారు. దీంతో కంపెనీ ఉత్పత్తి సామర్థ్యం రెండింతలు కానున్నదని, 2030-31 నాటికి వార్షిక సామర్థ్యం 12 లక్షల యూనిట్లకు చేరుకోనున్నట్టు చెప్పారు.
అలాగే వచ్చే ఐదేండ్లలో దేశీయ మార్కెట్లోకి ఆరు కొత్త మాడళ్లను తీసుకురానున్నట్టు ఆయన ప్రకటించారు. దేశీయ ప్యాసింజర్ వాహన పరిశ్రమ వచ్చే ఐదేండ్లలో 64 లక్షల యూనిట్లకు చేరుకోనున్నదని, అలాగే ఈవీ అమ్మకాలు కూడా 10.11 లక్షలకు చేరుకుంటుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తంచేశారు.