TATA | న్యూఢిల్లీ, జూలై 3: టాటా మోటర్స్ ప్యాసింజర్ వాహన ధరలు పెరగనున్నాయి. ఈ నెల 17 నుంచి పెరిగిన ధరలు అమల్లోకి రానున్నట్టు సోమవారం సంస్థ ప్రకటించింది. ఈవీలతోసహా అన్ని మోడల్స్, వేరియంట్ల ధరలు సగటున 0.6 శాతం పెరుగుతాయని కంపెనీ వివరించింది. భారంగా మారిన ఉత్పాదక వ్యయం వల్లే ఈ ధరల పెంపు అని తెలిపింది.
కాగా, ఈ నెల 16 వరకు జరిగే బుకింగ్స్పై ధరల పెరుగుదల ఉండబోదని, డెలివరీలు ఈ నెలాఖరుకల్లా జరుగుతాయని సంస్థ స్పష్టం చేసింది. ప్రస్తుతం పంచ్, నెక్సాన్, హరియర్ తదితర మోడళ్లను మార్కెట్లో టాటా మోటర్స్ విక్రయిస్తున్నది.