న్యూఢిల్లీ, నవంబర్ 5: ప్యాసింజర్ వాహన ధరలను మరోసారి పెంచింది టాటా మోటర్స్. సోమవారం నుంచి అమలులోకి వచ్చేలా అన్ని రకాల ప్యాసింజర్ వాహన ధరలను 0.9 శాతం వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. ఉత్పత్తి వ్యయం పెరగడం వల్లనే ధరలను పెంచాల్సి వచ్చిందని, దీంతో ఆయా మోడళ్లు మరింత ప్రియంకానున్నాయని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం సంస్థ టియా గో, పంచ్, నెక్సాన్, హారియర్, సఫారీ మోడళ్ళను విక్రయిస్తున్నది.