న్యూఢిల్లీ, జనవరి 18: నూతన సంవత్సరంలో ప్యాసింజర్ వాహనాలను కొనుగోలు చేయాలనుకునేవారికి షాకిచ్చింది టాటా మోటర్స్. తన ప్యాసింజర్ కార్ల ధరలను ఒక్క శాతం వరకు పెంచుతున్నట్లు తాజాగా ప్రకటించింది. పెంచిన ధరలు ఈ నెల 19(బుధవారం) నుంచి అమలులోకి రానున్నట్లు ఒక ప్రకటనలో వెల్లడించింది. ఉత్పత్తి వ్యయం పెరగడం వల్లనే ధరలు మరోసారి పెంచాల్సి వచ్చిందని తెలిపింది. ప్రస్తుతం సంస్థ దేశవ్యాప్తంగా టియాగో, పంచ్, హారియర్ మోడళ్ళను విక్రయిస్తున్నది. ఈ నెల 18 లోపు కార్లను బుకింగ్ చేసుకున్న వారికి ఈ ధరల పెంపు నుంచి మినహాయింపునిచ్చింది. ఇప్పటికే మారుతి, మహీంద్రా, స్కోడా, బీఎండబ్ల్యూ, మెర్సిడెజ్ బెంజ్వంటి సంస్థలు తమ వాహన ధరలను నాలుగు శాతం వరకు పెంచిన విషయం విదితమే.