ముంబై, జనవరి 27:ప్యాసింజర్ వాహన (పీవీ) ధరలను పెంచింది టాటా మోటర్స్. వచ్చే నెల 1 నుంచి అమలులోకి వచ్చేలా అన్ని రకాల వాహన ధరలను 1.2 శాతం వరకు పెంచుతున్నట్లు తాజాగా ప్రకటించింది.
ఉద్గారానికి సంబంధించి నూతన మార్గదర్శకాలు అమ లు చేయడం, ఉత్పత్తి వ్యయం పెరగడంతో సంస్థపై పడుతున్న భారాన్ని తగ్గించుకోవడంలో భాగంగా ధరలు పెంచకతప్పడం లేదని పేర్కొంది. సంస్థ తీసుకున్న తాజా నిర్ణయంతో నెక్సాన్, సఫారి, పంచ్ మాడళ్లు మరింత ప్రియంకానున్నాయి.