న్యూఢిల్లీ, జనవరి 18: ఈవీ కార్లను కొనుగోలు చేసేవారికి శుభవార్తను అందించింది టాటా మోటర్స్. కంపెనీకి చెందిన నెక్సాన్ ఈవీ మోడల్ ధరను రూ.50 వేలు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో నెక్సాన్ ఈవీ ప్రారంభ ధర రూ.14.49 లక్షలుగా ఉన్నది. గతంలో ఈ ధర రూ.14.99 లక్షలుగా ఉండేది. అలాగే రూ.16.49 లక్షల ప్రారంభ ధరతో నెక్సాన్ ఈవీ మ్యాక్స్ గరిష్ఠంగా రూ.18.99 లక్షల లోపు లభించనున్నది. ఈవీ మ్యాక్స్ డ్రైవింగ్ పరిధిని 437 కిలోమీటర్ల నుంచి 453 కిలోమీటర్లకు పెంచింది. ఒక్కసారి రీచార్జితో 453 కిలోమీటర్లు ప్రయాణించనున్నది.