Tata Motors | టాటా సన్స్ అనుబంధ టాటా మోటార్స్ తన వాణిజ్య, ప్యాసింజర్ వాహన విభాగాలను విడదీయనున్నది. ఇక నుంచి కమర్షియల్ వెహికల్స్, ప్యాసింజర్ వెహికల్స్గా ఉంటాయి. కార్లు, ఎలక్ట్రిక్ కార్లు, జాగ్వార్ లాండ్ రోవర్తో కూడిన కార్ల విభాగం, వాణిజ్య వాహనాల విభాగం వేర్వేరుగా ఉంటాయని సోమవారం జరిగిన టాటా మోటార్స్ బోర్డు సమావేశంలో తీర్మానించారు. ఈ సంగతి టాటా మోటార్స్ రెగ్యులేటరీ ఫైలింగ్ లో వెల్లడించింది.
ఈ సందర్భంగా టాటా మోటార్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ మాట్లాడుతూ గత ఐదేండ్లుగా సంస్థ మెరుగైన పనితీరు కనబరుస్తున్నదని అన్నారు. మూడో ఆటోమోటివ్ వ్యాపారాలు స్థిరంగా, స్వతంత్రంగా అభివ్రుద్ధి చెందుతాయని చెప్పారు. డీ మెర్జర్ తో మార్కెటింగ్ అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. ఎన్సీఎల్టీ మార్గదర్శకాలకు అనుగుణంగా రెండు వేర్వేరు కంపెనీలు ఏర్పాటవుతాయన్నారు.
ప్రతిపాదిత డీ మెర్జర్ ప్రక్రియకు వాటాదారులు, రుణ దాతలు, నియంత్రణ సంస్థల నుంచి ఆమోదం పొందాల్సి ఉందని టాటా మోటార్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ తెలిపారు. ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు 12-15 నెలల సమయం పడుతుందని అన్నారు. దీనివల్ల ఉద్యోగులు, కస్టమర్లు, వ్యాపార భాగస్వాములపై ఎటువంటి ప్రభావం ఉండబోదన్నారు. కార్లు, పికప్ వ్యాన్లు, బస్సులు, ట్రాక్టర్లను టాటా మోటార్స్ తయారు చేస్తున్నది.