న్యూఢిల్లీ, మార్చి 5: దేశీయ ఆటోమొబైల్ దిగ్గజాల్లో ఒకటైన టాటా మోటర్స్..మార్కెట్లోకి మరో మూడు సరికొత్త మాడళ్లను విడుదల చేసింది. డార్క్ ఎడిషన్గా నెక్సాన్ ఈవీ, నెక్సాన్, హారియర్, సఫారీలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రత్యేక ఎడిషన్గా ప్రవేశపెట్టిన ఈ మూడు మాడళ్లు నలుపు రంగుల్లోనే తీర్చిదిద్దింది.
నెక్సాన్ డార్క్ ఎడిషన్ ధరను రూ.11.45 లక్షలుగాను, నెక్సాన్ ఈవీ డార్క్ ఎడిషన్ రూ.19.49 లక్షలు, హారియర్ డార్క్ ఎడిషన్ రూ.19.99 లక్షలు, సఫారీ డార్క్ ఎడిషన్ రూ.20.69 లక్షలుగా నిర్ణయించింది. నెక్సాన్ ఈవీ డార్క్ ఎడిషన్ను 40.5 కిలోవాట్ల బ్యాటరీ, 143 బీహెచ్పీ ఎలక్ట్రిక్ మోటర్తో రూపొందించిన ఈ మాడల్ సింగిల్ చార్జింగ్తో 465 కిలోమీటర్లు ప్రయాణించనున్నది.