Hyderabad | హైదరాబాద్, మార్చి 21: వ్యవసాయ ఉత్పత్తుల సంస్థ సింజెంటా..తెలంగాణలో విత్తనాల టెస్టింగ్ ల్యాబ్ను ప్రారంభించింది. రూ.20 కోట్ల పెట్టుబడితో 6,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో హైదరాబాద్కు సమీపంలోని నూతన్కల్ గ్రామంలో ఏర్పాటు చేసిన ఈ టెస్టింగ్ ల్యాబ్ను కంపెనీ ఆసియా పసిఫిక్ హెడ్ నిశిచింట్ భాఠియా గురువారం ప్రారంభించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ..భారత్తోపాటు ఆసియా పసిఫిక్ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లలో ఇది కూడా ఒకటని వ్యాఖ్యానించారు. 12 వేల వైరస్/బ్యాక్టరియల్ టెస్ట్ చేసే సామర్థ్యం ఈ ల్యాబ్ కలిగివున్నది.