Switzerland | హైదరాబాద్, మార్చి 6: స్విట్జర్లాండ్ను సందర్శించే భారతీయుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నది. మెట్రో నగరాలవారీగా చూస్తే హైదరాబాద్ నాలుగో స్థానంలో నిలిచిందని స్విట్జర్లాండ్ టూరిజం చీఫ్ మార్కెటింగ్ అధికారి సిమాన్ బాస్హార్ట్ తెలిపారు. తొలి స్థానంలో ఢిల్లీ ఉండగా, తర్వాత ముంబై, బెంగళూరున్నాయి. కరోనా ప్రభావం నుంచి కోలుకుంటున్నట్టు చెప్పారు. ఈ ఏడాది టూరిస్టుల సంఖ్య 8 లక్షలుగా ఉండొచ్చన్నారు.